కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డ్.. ఒక్కరోజే 4 లక్షల కొత్తకేసులు.. !

First Published May 1, 2021, 10:59 AM IST

కరోనా కేసుల్లో భారత్ కొత్త ప్రపంచరికార్డు సొంతం చేసుకుంది. గత 24 గంటల్లో 4,01,993 తాజా కేసులు నమోదవ్వడంతో ప్రపంచ రికార్డును సాధించింది. 24 గంటల్లో 3,523 మంది మృతి చెందారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్ మూడవ దశ ఈ రోజు ప్రారంభమైంది. కాగా అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో చేతులెత్తేశాయి.  

కరోనా కేసుల్లో భారత్ కొత్త ప్రపంచరికార్డు సొంతం చేసుకుంది. గత 24 గంటల్లో 4,01,993 తాజా కేసులు నమోదవ్వడంతో ప్రపంచ రికార్డును సాధించింది. 24 గంటల్లో 3,523 మంది మృతి చెందారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్ మూడవ దశ ఈ రోజు ప్రారంభమైంది. కాగా అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో చేతులెత్తేశాయి.
undefined
తొమ్మిది రోజుల కిందట ఒక్కరోజే 3 లక్షల కొత్త కేసుల నమోదుతో రికార్డు సృష్టించిన భారత్ తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టింది. మొదటిసారిగా 4 లక్షలకు పైగా కేసులు నమోదు చేసింది. సెకండ్ వేవ్ దాటికి దేశం వణికిపోతోంది. మూడు వారాల కిందట ఒక్కరోజు నమోదైన తాజా కేసుల సంఖ్య లక్ష ఉండగా అది ఇప్పుడు 4 లక్షలకు చేరడం దారుణం.
undefined
ఆక్సీజన్, బెడ్ల కొరత.. సాయం కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం హెచ్చరించింది. "పౌరులు తమ మనోవేదనలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడానికి చూస్తే.. దాన్ని అరికట్టడం మాకు ఇష్టం లేదు.. అని జస్టిస్ డివై చంద్రచూడ్ ఒక విచారణ సందర్భంగా చెప్పారు.
undefined
దేశ వ్యాప్తంగా 18-44 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి టీకాలు ఇచ్చే మూడవ దశ ఈ రోజు ప్రారంభమవుతుంది. కాగా ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ - లాంటి అనేక రాష్ట్రాలు తమ దగ్గర వ్యాక్సిన్ డోసులు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాతరం వారి దగ్గర కోటి డోసుల మోతాదు రాష్ట్రాల్లో అందుబాటులో ఉందని చెబుతోంది.
undefined
ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం మంత్రుల మండలితో సమావేశం నిర్వహించారు. "రాష్ట్రాలతో సమన్వయం, వైద్య సామర్థ్యాలను పెంచడం మరియు ఆక్సిజన్ లభ్యతను పెంచడం వంటి వివిధ చర్యలపై చర్చించారు" అని ప్రధాని సమావేశం తరువాత చెప్పారు.
undefined
కోవిడ్ విజృంభణ నేపథ్యంలో అమెరికా, ఆస్ట్రేలియాలు భారత్ కు ప్రయాణాల్ని పరిమితం చేశాయి. కోవిడ్ కొత్త నిబంధనలను ధిక్కరించిన వారికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆస్ట్రేలియా హెచ్చరించింది.
undefined
COVID-19 కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో సాయుధ దళాలు సమర్థవంతంగా పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అత్యవసర ఆర్థిక అధికారాలను మంజూరు చేసింది. వీటితో వారికి సౌకర్యాలు నిర్వహించడానికి, పరికరాలు, వనరులను సేకరించడానికి, అత్యవసర పనులను ఉపయోగపడతాయి.
undefined
దేశంలో కరోనావైరస్ కేసులు వచ్చే వారం మే 3 - 5 మధ్య పెరిగే అవకాశం ఉందని.. గణిత నమూనా మోడలింగ్ ప్రకారం, తేలిందని "వచ్చే వారం నాటికి దేశవ్యాప్తంగా రోజువారీ కొత్త కేసులు పెరిగే అవకాశం ఉందని మా నమ్మకం" అని ప్రభుత్వం నియమించిన శాస్త్రవేత్తల బృందం అధిపతి ఎం విద్యాసాగర్ చెప్పారు.
undefined
అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, చైనా, జపాన్ సహా పలు దేశాలు భారతదేశానికి తమ పూర్తి మద్దతు ఇస్తామని తెలిపాయి. అమెరికా నుండి శుక్రవారం భారత్ కు కోవిడ్ సామాగ్రి చేరుకుంది.
undefined
ఎన్నికల ర్యాలీలతో కేసులు విపరీతంగా పెరుగుదుల కనిపిస్తున్న నేపత్యంలో బెంగాల్ లో శుక్రవారం పాక్షిక లాక్డౌన్ ప్రకటించారు. బెంగాల్ లో ఎనిమిది దశల ఎన్నికలలు ముగిశాయి. రేపు ఫలితాలు వస్తాయి.
undefined
ఎన్నికల ర్యాలీలతో కేసులు విపరీతంగా పెరుగుదుల కనిపిస్తున్న నేపత్యంలో బెంగాల్ లో శుక్రవారం పాక్షిక లాక్డౌన్ ప్రకటించారు. బెంగాల్ లో ఎనిమిది దశల ఎన్నికలలు ముగిశాయి. రేపు ఫలితాలు వస్తాయి.
undefined
శుక్రవారం ముగిసిన మెగా కుంభమేళా దేశంలో సెకండ్ వేవ్ కు కారణమని చాలా మంది నిపుణులుపేర్కొన్నారు. మతపరమైన ఉత్సవంలో 70 లక్షలకు పైగా ప్రజలు పాల్గొన్నారని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి.
undefined
click me!