ఇక, ఆపరేషన్ కావేరి కింద భారతదేశం తన పౌరులను ఖార్టూమ్, ఇతర సమస్యాత్మక ప్రాంతాల నుండి బస్సులలో పోర్ట్ సుడాన్కు తరలిస్తుంది. అక్కడి నుంచి వారిని తొలుత సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి భారత వైమానిక దళానికి చెందిన విమానాల ద్వారా భారత్కు తరలిస్తున్నారు. భారతీయుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించడానికి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ జెడ్డాకు చేరుకున్నారు.