భోపాల్ : మధ్యప్రదేశ్లోని ధార్ నగరంలోని నివాస ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఓ యువతిని ఓ దుండగుడు కాల్చి చంపాడు. అతడు ఆ యువతిని గత రెండేళ్లుగా వేధిస్తున్నాడు. ఈ కేసులో అనుమానితుడిగా దీపక్ రాథోడ్ గా గుర్తించారు. అతను పూజా (22) అనే మహిళను గత రెండేళ్లుగా పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తూ, వెంబడిస్తున్నాడని, అయితే ఆమె అతనిని పదే పదే తిరస్కరించిందని పోలీసులు తెలిపారు.