సిఎంఆర్ యూనివర్సిటీలో బీకాం గ్రాడ్యుయేట్ అయిన 29 ఏళ్ల జనార్దన్ ఎప్పుడూ స్టాక్ మార్కెట్పై మక్కువ చూపేవాడు. తర్వాత ఆ అభిరుచిని గోల్డ్ జనార్ధన్ ఇన్వెస్టర్ పేరుతో యూట్యూబ్ ఛానెల్గా మార్చాడు.
“గ్రాడ్యుయేషన్ తర్వాత, నేను 2018లో ఒక ఆటోమొబైల్ కంపెనీకి సేల్స్పర్సన్గా చేశాను. కోవిడ్ సమయంలో, నా ఉద్యోగం పోయింది. దీనివల్ల నేను విపరీతమైన ఆర్థిక ఒత్తిడికి గురయ్యాను. పని కోసం వెతుకుతున్నాను, కానీ నాకు నెలకు రూ.15-20వేల కంటే ఎక్కువ ఇవ్వడానికి ఏ కంపెనీ సిద్ధంగా లేదు,”అని జనార్దన్ చెప్పారు.