మైగోవ్ సిఇఒ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, మైగోవ్ కరోనా హెల్ప్డెస్క్ దేశవ్యాప్తంగా మిలియన్ల మంది పౌరులకు సమాచారాన్ని వేగంగా అందించే గొప్ప సాంకేతిక పరిష్కారంగా మారిందన్నారు.
"ఇది ప్రారంభించినప్పటి నుండి, మైగోవ్ కరోనా హెల్ప్డెస్క్, హప్టిక్, టర్న్ మద్దతుతో ప్రారంభించబడింది. గో-టు ప్లాట్ఫారమ్గా అభివృద్ధి చెందింది. ఇది పౌరులకు ప్రామాణికమైన కరోనా-సంబంధిత సమాచారం అందిస్తూ సహాయపడటమే కాకుండా.. ఇప్పుడు టీకా ప్రక్రియలో కూడా వారికి సహాయపడుతోంది. టీకా కేంద్రాలు, స్లాట్లను కనుగొనడం, టీకా సర్టిఫికేట్లను డౌన్లోడ్ చేయడం వంటివి కూడా బుకింగ్ చేసుకోవచ్చు’’