తక్కువ పెట్టుబడితో కోట్ల టర్నోవర్ సాధించిన మహిళ.. నీతా అడప్పా సక్సెస్ ఫుల్ స్టోరీ!

First Published Aug 5, 2023, 12:41 PM IST

ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారంగంలో అడుగుపెట్టి నిలదిక్కుకోవటం అంటే మామూలు విషయం కాదు. కానీ ఒక స్త్రీ మూర్తి మాత్రం అద్భుతం సాధించింది. 10,000 పెట్టుబడితో కోట్లు టర్నోవర్ చేస్తున్న ఆ సక్సెస్ ఫుల్ స్టోరీ ఏంటో చూద్దాం. 1995 లో మహిళలు సొంతంగా వ్యాపారం చేయటం అంటే మామూలు విషయం కాదు కానీ ఆ సమయంలోనే ఒక స్త్రీమూర్తి వ్యాపారంగంలో పదివేల రూపాయల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు కోట్లలో టర్నోవర్ సాధిస్తుంది.
 

ఈ సక్సెస్ ఫుల్ స్టోరీ వెనుక ఉన్న కథ ఏంటో చూద్దాం. బెంగుళూరు నివాసి అయిన నీతా అడప్పా ఇప్పుడు ఒక వ్యాపార దగ్గర కానీ ఆమె కెరియర్ మొదలుపెట్టేనాటికి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాధారణ యువతి ఆమె తండ్రి మూలిక ఉత్పత్తి తయారీ సంస్థలు సేల్స్ మేనేజర్ గా పని చేసేవాడు. ఈమె ముంబైలో మాస్టర్ చేసి బిజినెస్ చేయాలని కలలు కంటూ ఉండేది.
 

అందుకే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కేవలం 10,000 రూపాయలతో వ్యాపారాన్ని మొదలుపెట్టింది. ఆ రోజులలో ఒక మహిళ వ్యాపారం చేయడం అంటే అంతే తేలికైన విషయం కాదు. కానీ అలాంటి పరిస్థితులకు ఎదురు నిలబడి ప్రకృతి హెర్బల్స్ అనే సంస్థని ప్రారంభించింది. వ్యాపారంలో దిగటానికి ముందు చర్మ సౌందర్యానికి జుట్టు సంరక్షణకు సంబంధించిన సుదీర్ఘ పరిశోధనల అనంతరం తన వ్యాపారాన్ని కేవలం 10,000 రూపాయలతో తన స్నేహితురాలతో కలిపి ప్రారంభించింది నీతా అడప్పా.
 

అప్పటికే మార్కెట్లో చాలా రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉండటంతో తన వ్యాపారాన్ని భిన్నమైన పద్ధతిలో కొనసాగించాలని నిర్ణయించుకుంది ముందుగా తన ప్రొడక్ట్స్ ని హోటల్స్ ద్వారా మార్కెటింగ్ చేసుకుంది. హోటల్ రంగంలో విజయం సాధించిన తర్వాత 2011లో  రిటైల్ రంగంలోకి ప్రవేశించింది. తను ఉత్పత్తులని ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా అమ్మకం మొదలుపెట్టి ఇప్పుడు కోట్లలో టర్నోవర్ సాధిస్తుంది. ఇది వినూత్నంగా ఆలోచిస్తే విజయం తథ్యం అని నిరూపించిన ఒక మహిళ విజయగాధ. మిగిలిన స్త్రీలకి స్ఫూర్తినిచ్చే సక్సెస్ స్టోరీ.

click me!