బెంగళూరు : క్యాబ్లో వెళుతున్నప్పుడు మాట్లాడిన వ్యక్తిగత విషయాలను శ్రద్ధగా ఆలకించాడు ఓ డ్రైవర్. ఆ తర్వాత ఆ మహిళా ప్రయాణికురాలిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. భారీ స్థాయిలో డబ్బులు గుంజిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. క్యాబ్ లోనో, ఆటోలోనో ఎక్కినప్పుడు…ప్రయాణమంతా ఖాళీగా ఉండడం ఎందుకు అన్నట్టుగా ఫోన్లో మాట్లాడడం. ప్రతీ ఒక్కరూ చేసే పనే.