మోదీ నాయకత్వంలో Article 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, వక్ఫ్ సవరణ చట్టం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సబ్ కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో మోదీ ప్రభుత్వం ప్రతి వర్గానికీ అభివృద్ధి అందించేలా చర్యలు చేపట్టింది.
నితి ఆయోగ్ నివేదిక ప్రకారం గత 9 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ విజయానికి మోదీ ప్రభుత్వం తీసుకున్న పథకాలు, పేదలకు చేరువైన సంక్షేమ చర్యలే కారణం అని అంతర్జాతీయ సంస్థలు కూడా ప్రశంసించాయి.