Haunted Railway Stations : భారత్‌లోని టాప్ 5 మిస్టరీ రైల్వే స్టేషన్లు.. కర్నూల్ స్టేషన్ దీ వింత కథే..!

Published : Mar 10, 2026, 08:49 AM IST

భారత్‌లో కొన్ని రైల్వే స్టేషన్లకు వింత కథలున్నాయి. దెయ్యాలు తిరుగుతాయని, అర్థరాత్రి అరుపులు వినిపిస్తాయని రకరకాలుగా చెప్పుకుంటారు. ఈ 5 మిస్టరీ రైల్వే స్టేషన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
భారత్‌లోని మిస్టరీ రైల్వే స్టేషన్లు

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటి. రోజూ లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దేశవ్యాప్తంగా 7 వేలకు పైగా స్టేషన్లు ఉన్నాయి. చాలా స్టేషన్లు 24 గంటలూ రద్దీగా ఉంటాయి. కానీ కొన్ని స్టేషన్లకు మాత్రం దెయ్యాల కథలున్నాయి. వాటి గురించే ఈ స్టోరీ.

26
నైని రైల్వే స్టేషన్ (ఉత్తర ప్రదేశ్)

గంగా నదికి సమీపంలో ఉన్న ఈ నైని రైల్వే స్టేషన్‌లో ఆశ్చర్యకర ఘటనలు జరుగుతాయని చెబుతారు. ప్లాట్‌ఫారమ్‌లపై వింత ఆకారాలు కనిపిస్తాయని, అర్థం కాని శబ్దాలు వినిపిస్తాయని ప్రయాణికులు చాలాసార్లు ఫిర్యాదు చేశారు. అందుకే ఇక్కడికి వెళ్లాలంటే భయపడతారట.

36
చిత్తూరు రైల్వే స్టేషన్ (ఆంధ్ర ప్రదేశ్)
దక్షిణ భారతదేశంలో మిస్టరీగా చెప్పుకునే స్టేషన్లలో చిత్తూరు ఒకటి. ఇక్కడ రైలు ప్రమాదంలో చనిపోయిన ఓ మహిళ ఆత్మ న్యాయం కోసం అరుస్తుందని స్థానికులు నమ్ముతారు. రాత్రిపూట ఒంటరిగా ఉండటానికి రైల్వే సిబ్బంది కూడా భయపడతారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
46
బెగున్‌కోడోర్ రైల్వే స్టేషన్ (పశ్చిమ బెంగాల్)
భారత్‌లో అత్యంత ఫేమస్ 'దెయ్యం' రైల్వే స్టేషన్ ఇదే. తెల్లచీర కట్టుకున్న ఓ మహిళ స్టేషన్‌లో తిరుగుతూ, రాత్రిపూట పట్టాలపై నడుస్తుందని స్థానికులు నమ్ముతారు. ఈ కథల భయంతో చాలా మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేయడానికి నిరాకరించారు. ఏకంగా 42 ఏళ్లు ఈ స్టేషన్‌ను మూసివేశారు. 2009లో మళ్లీ తెరిచినా, సూర్యాస్తమయం తర్వాత అక్కడికి వెళ్లడానికి జనం ఇప్పటికీ భయపడతారు.
56
బరోగ్ రైల్వే స్టేషన్ (హిమాచల్ ప్రదేశ్)

కొండల మధ్య అందంగా కనిపించే ఈ స్టేషన్ వెనుక ఓ విషాద గాథ ఉంది. దీన్ని నిర్మించిన ఇంజనీర్, కల్నల్ బరోగ్ నిర్మాణంలో పొరపాటు జరగడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మ ఇప్పటికీ అక్కడి సొరంగం దగ్గర తిరుగుతుందని స్థానికులు నమ్ముతారు.

66
లూథియానా రైల్వే స్టేషన్ (పంజాబ్)

పంజాబ్‌లోని లూథియానా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై విషాదకరంగా మరణించిన ఓ మహిళ ఆత్మ తిరుగుతుందని వదంతి ఉంది. అర్థరాత్రి వినిపించే భయంకరమైన అరుపులు, అకస్మాత్తుగా మాయమయ్యే ఆకారాలు ప్రయాణికులను, సిబ్బందిని ఇప్పటికీ భయపెడుతున్నాయి. అందుకే రాత్రిపూట ఈ స్టేషన్‌కు వెళ్లాలంటే జనం జంకుతారు. 

గమనిక : ఈ రైల్వే స్టేషన్లలో దెయ్యాలు, ఆత్మలు తిరుగుతున్నాయని చెప్పేవన్నీ స్థానికుల నమ్మకాలు మాత్రమే. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగలరు.

Read more Photos on
click me!

Recommended Stories