పటియాలా ప్రాంతాన్ని పాలించిన మహారాజా భూపీందర్ సింగ్ వద్ద రోల్స్ రాయిస్ కార్ల కలెక్షన్ ఉండేది. ఈ కార్లు చాలామంది రాజుల వద్ద వుండేవి. కానీ మరే ఇతర భారతీయ రాజు వద్ద లేని ఒక ప్రత్యేకమైన వాహనం కూడా ఆయన వద్ద ఉండేదట. అదే ఆయనకు హిట్లర్ బహుమతిగా ఇచ్చిన మేబాచ్ కారు.
మొఘల్ పాలన పతనం తరువాత 1763లో బాబా ఆలా సింగ్ పటియాలా సంస్థానాన్ని స్థాపించారు. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారికి పటియాలా పాలకులు సహకారం అందించారు. దీంతో పటియాలా రాజులకు బ్రిటీష్ ప్రభుత్వం కూడా అనేక రకాలుగా సహాయసహకారాలు అందించింది. అలాగే ఈ ప్రాంతంలోని సారవంతమైన వ్యవసాయ భూమి కలిగివుండటం, పంటలు బాగా పండటంతో భారతదేశంలోని అత్యంత సంపన్నమైన, శక్తివంతమైన రాజ్యంగా పటియాలా నిలిపింది.