Google Chrome warning : గూగుల్ క్రోమ్ యూజర్లను భారత ప్రభుత్వం హెచ్చరించింది. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) ఆధ్వర్యంలోని సైబర్ సెక్యూరిటీ వాచ్డాగ్ గూగుల్ క్రోమ్ యూజర్ల డేటా చోరీ అయ్యే అవకాశముందని హెచ్చరించింది. విండోస్, మాక్, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లలో క్రోమ్ వాడుతున్నవారిపై ప్రభావం పడే అవకాశముందని పేర్కొంది.