అసలేం జరిగిందంటే :
కొచ్చి నగరంలోని పల్లురుత్తి ప్రాంతానికి చెందిన అష్రఫ్ విదేశాల్లో ఉద్యోగాల పేరిట యువతను మోసం చేస్తుంటాడు. ఇలా ఇటీవల ఆరుగురు యువకులను మాయమాటలతో నమ్మించాడు. ఒక్కొక్కరి దగ్గర రూ.50 వేలు తీసుకుని లావోస్ కు తీసుకెళ్లాడు.
ఇలా అక్రమంగా లావోస్ కు తరలించిన యువకులను ఓ చైనీస్ కంపనీకి అమ్మకానికి పెట్టాడు. కంపనీతో ఒక్కో యువకుడికి రూ.4 లక్షలకు ఢీల్ కుదుర్చుకుని అమ్మేసాడు. ఇలా దేశంకాని దేశంలో అంగట్లో సరుకులా మారిపోయారు యువకులు. ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఆ చైనీస్ కంపనీలో ఇంతకాలం నరకం అనుభవించారు.