ఎలక్ట్రానిక్స్ రంగంలో పదేళ్ళలోనే ఇంత మార్పా..!
2014-15 పైనాన్సియల్ ఇయర్ లో భారతదేశంలో తయారయ్యే ఎలక్ట్రానిక్స్ విలువ కేవలం రూ.9,52,00 కోట్లు మాత్రమే. కానీ పదేళ్లు గడిచేసరికి అంటే 2023-24 ఫైనాన్సియల్ ఇయర్ లో దేశీయంగా తయారయ్యే ఎలక్ట్రానిక్స్ విలువ రూ.9,52,000 కు పెరిగింది.
మొబైల్ ఫోన్ల తయారీ విషయంలో మరింత పురోగతి సాధించింది భారత్. గతంలో దిగుమతి చేసుకుంటుంటే ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. ఫైనాన్సియల్ ఇయర్ 2014-15 లో ఇండియాలో అమ్ముడయ్యే 74 శాతం మొబైల్ ఫోన్లు దిగుమతి చేసుకున్నవే. అంటే దేశీయంగా తయారైనవి కావన్నమాట. కానీ ఇప్పుడు భారతీయులు ఉపయోగించే 99 శాతం మొబైల్స్ దేశీయంగా తయారైనవే. ఇలా ప్రస్తుతం దేశీయ అవసరాలను తీర్చడమే కాదు విదేశాలకు కూడా మొబైల్స్ ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుంది.