ఫెర్రీ మరో బోటును ఢీకొట్టిందా?
ముంబైకి సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన 'ఎలిఫెంటా' దీవికి బోటు వెళ్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో స్పీడ్ బోట్ ఢీకొట్టిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. స్పీడ్ బోట్ నేవీకి చెందినదని స్థానిక నేత ఒకరు పేర్కొన్నారు.
నేవీ నివేదిక ప్రకారం, సాయంత్రం 4 గంటలకు, ఇంజన్ ట్రయల్స్ సమయంలో ఓడ నియంత్రణ కోల్పోయి ముంబైలోని కరంజా సమీపంలో ప్రయాణీకుల ఫెర్రీ నీల్ కమల్ను ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. ఫెర్రీ గేట్ వే ఆఫ్ ఇండియా, ఎలిఫెంటా ద్వీపం మధ్య ప్రయాణికులతో నడుస్తోంది. "ఈ ప్రాంతంలో నేవీ, సివిల్ క్రాఫ్ట్ చేత ప్రాణాలతో బయటపడిన వారిని సమీపంలోని జెట్టీలు, ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటివరకు 99 మంది ప్రాణాలతో రక్షించబడ్డారు" అని నేవీ అధికారి ధృవీకరించారు.