స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గ్రామాల్లో కూడా ఘనంగా జరుగుతాయి. పాఠశాలలు, మైదానాల్లో జెండా వందనం, దేశభక్తి గీతాల ఆలపన, నాటకాలు, జానపద నృత్యాల ప్రదర్శనలతో ఆగస్టు 15ను ఉత్సాహంగా జరుపుకుంటారు. కబడ్డీ, తాడు లాగడం, సామూహిక భోజనాలు, చెట్ల పెంపకం వంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను బలపరుస్తాయి.
ఇదిలా ఉంటే.. టెక్నాలజీ, సోషల్ మీడియా కూడా దేశభక్తికి ప్రాణం పోస్తుందనే చెప్పాలి. టెలివిజన్, రేడియో, డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా ఢిల్లీ ఎర్రకోటలోని జెండా వందన వేడుకలు ప్రత్యక్ష ప్రసారంగా దేశమంతా చూడగలుగుతోంది.
#IndependenceDay, #JaiHind వంటి హ్యాష్ట్యాగ్లతో ప్రజలు ఫోటోలు, సందేశాలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ దేశభక్తిని వ్యక్తపరుస్తారు. ఇదే భారత స్వాతంత్య్ర దినోత్సవం ప్రత్యేకత.