రూ. 5వేల కోట్లతో కాలేదు, లాక్‌డౌన్ చేసింది: స్వచ్ఛంగా మారిన యమునా నది

First Published May 26, 2020, 10:51 AM IST

లాక్ డౌన్ కారణంగా దేశంలోని గంగా, యమునా నదుల నీళ్లు స్వచ్ఛంగా మారాయి.ఈ నదులను కాలుష్యం నుండి కాపాడేందుకు ప్రభుత్వాలు చేసిన ఫ్రయత్నాలు ఇంతవరకు ఫలితాలు ఇవ్వలేదు. కానీ లాక్ డౌన్ తో నదుల నీళ్లు స్వచ్ఛంగా మారాయి.

లాక్‌డౌన్ కారణంగా యమునా నది కాలుష్యం బారి నుండి బయటపడింది. ఈ నది నీళ్లు స్వచ్ఛంగా మారాయి. ఈ నదిని కాలుష్యం నుండి బయటపడేసేందుకు ప్రభుత్వాలు వేలాది కోట్ల రూపాయాలను ఖర్చు చేసినా దక్కని ఫలితం లాక్ డౌన్ వల్ల దక్కింది.
undefined
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా ఈ ఏడాది మార్చి మూడో వారం నుండి కేంద్ర ప్రభుత్వం దేశంలో లాక్ డౌన్ విధించింది.ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగనుంది.
undefined
గంగా, యమూనా నదులను కాలుష్యం బారి నుండి కాపాడేందుకు గత 25 ఏళ్లుగా ప్రభుత్వాలు రూ.5000 కోట్లను ఖర్చు చేశాయి. కానీ, ఎలాంటి ఫలితం దక్కలేదు. ఈ నీళ్లు స్వచ్ఛతకు దూరంగా ఉన్నాయి.
undefined
ఇప్పటికే గంగా నది కూడ స్వచ్ఛంగా మారిందని గత మాసంలోనే నిపుణులు ప్రకటించారు. ఇప్పుడు యమునా నది నీళ్లు స్వఛ్చంగా మారాయి. కాలుష్యం తగ్గడంతో పక్షులు నదికి వలస కట్టాయి.
undefined
దేశంలోని ఏడు రాష్ట్రాల్లో యమునా ప్రవహిస్తోంది. సుమారు 1400 కి.మీ పాటు ఈ నది ప్రయాణం చేస్తోంది. నది ఒడ్డున ఉన్న కాలనీలు, ఫ్యాక్టరీల నుండి వెలువడే వ్యర్థాలతో ఈ నది నీళ్లు కలుషితమయ్యాయి.
undefined
హర్యానా పానిపట్, ఢిల్లీలో సుమారు 300లకు పైగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ప్యాక్టరీల నుండి ప్రతి రోజూ వ్యర్థాలు యమునా నదిలో కలుస్తాయి. దీంతో ఈ నది నీళ్లు స్వచ్ఛతను కోల్పోయాయి.
undefined
ఢిల్లీ,ఆగ్రా, మధుర మధ్యలోనే ఈ నది నీళ్లు ఎక్కువగా కాలుష్యం బారినపడుతున్నట్టుగా నిపుణులు చెబుతున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపుగా రెండు మాసాలుగా ఫ్యాక్టరీలు మూసివేశారు.లాక్ డౌన్ నేపథ్యంలో ఫ్యాక్టరీలు మూసివేయడంతో ఈ నది నీళ్లు స్వచ్ఛంగా మారాయని స్థానికులు కూడ అభిప్రాయపడుతున్నారు.
undefined
ఈ నది నీళ్లు స్వచ్ఛంగా ఉండేలా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంధ సంస్థలు కోరుతున్నాయి. లాక్ డౌన్ తో ఢిల్లీలో కూడ కాలుష్యం బాగా తగ్గింది.ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు గతంలో సరి, బేసి పద్దతిలో వాహనాలను నడిపేవారు.
undefined
click me!