జాక్‌పాట్ కొట్టాడు: రూ. 30 వేలను కోల్పోయిన మూడు రోజుల్లోనే రూ. 8 లక్షలు

First Published May 25, 2020, 2:03 PM IST

ఢిల్లీలో మామిడి పండ్ల వ్యాపారికి దాతలు అండగా నిలిచారు. ఈ వ్యాపారి కష్టాలను న్యూస్ చానెల్ ప్రసారం చేసింది. దీంతో దాతలు తమకు తోచిన రీతిలో సహాయం చేశారు. 

న్యూఢిల్లీలో ఓ మామిడి పండ్ల వ్యాపారి రూ. 30 వేలను కోల్పోయిన మూడు రోజుల్లోనే రూ. 8 లక్షలను సంపాదించాడు. తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఆ పండ్ల వ్యాపారి ధన్యావాదాలు తెలిపారు.
undefined
న్యూఢిల్లీలోని నార్త్ ఢిల్లీలో చోటు అనే వ్యక్తి మామిడి పండ్లను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మామిడి పండ్లను విక్రయించే చోటు అనే వ్యక్తికి పక్కనే ఉన్న దుకాణం దారుడికి గత వారం క్రితం గొడవ జరిగింది.
undefined
ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే మామిడి పండ్లను రోడ్డుపై వచ్చిన జనం దోచుకు వెళ్లారు. పక్కనే ఉన్న మరో వ్యాపారితో ఆయన గొడవ పడుతున్న విషయాన్ని గమనించిన జనం తమకు దొరికిన పళ్లను చేతపట్టుకొని వెళ్లిపోయారు.
undefined
ఈ మామిడి పళ్లను జనం చేత పట్టుకొని వెళ్తున్న విషయం స్థానికంగా ఉన్న సీసీ పుటేజీల్లో రికార్డైంది. సుమారు రూ. 30 వేల విలువైన మామిడి పండ్లను జనం తీసుకెళ్లారు.
undefined
ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా చానెల్ ప్రసారం చేసింది. సర్వం కోల్పోయిన మామిడి పండ్ల వ్యాపారి గురించి ఆ ఛానెల్ ప్రసారం చేసింది. చోటుకు తోచిన సహాయం చేయాలని ఆ చానెల్ కోరింది. బాధితుడి బ్యాంకు ఖాతా వివరాలను కూడ ప్రసారం చేసింది.
undefined
దీంతో పండ్లను పోగోట్టుకొన్న మూడు రోజుల తర్వాత వ్యాపారికి రూ. 8 లక్షల విరాళాలు అందాయి. కొందరు నా వద్ద ఉన్న పళ్లను దొంగిలించారు. కానీ, చాలా మంది నాకు సహాయం చేశారని ఆ వ్యాపారి ఆనందంగా చెప్పారు.
undefined
వంద, రెండొందలు, వెయ్యి రూపాయాల చొప్పున దాతలు వ్యాపారికి సహాయం చేశారు. దాతల సహకారంతో తాను రంజాన్ పండుగగా తన కుటుంబంతో ఆనందంగా జరుపుకొంటానని ఆయన చెప్పాడు.
undefined
బుధవారం నాడు పండ్ల వ్యాపారి నుండి కొందరు మామిడి పండ్లను దోచుకెళ్లారు. టూవీలర్లపై వచ్చినవారు హెల్మెట్లలో, ఆటో డ్రైవర్లు తమ వాహనాల్లో మరికొందరు చేతుల్లో, బ్యాగుల్లో ఈ పండ్లను తీసుకెళ్లారు.ఈ ఘటనకు సంబంధించి నలుగురికి శనివారం నాడు అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.
undefined
click me!