తెలుగు ప్రజలు తస్మాత్ జాగ్రత్త :
HMPV వైరస్ కేసులు దక్షణాదిలోనే ఎక్కువగా వెలుగుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు పొరుగునే వున్న కర్ణాటక, మహారాష్ట్రలో ఇప్పటికే కేసులు బైటపడ్డాయి. కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే అప్రమత్తం అయ్యాయి. ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
HMPV వైరస్ అంత ప్రమాదకరమేమీ కాదని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ దేశంలో HMPV కేసుల నమోదు, వైరస్ వ్యాప్తిని పరిశీలిస్తోందని... ఇది రాష్ట్రంలో వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు చేపడుతోందని మంత్రి రాజనర్సింహ తెలిపారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా HMPV వైరస్ గురించి ఆందోళన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వైరస్ కేసులు నమోదు కాలేవని తెలిపారు. అయితే కర్ణాటక, మహారాష్ట్రలో కేసులు బైటపడ్డ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించారు సీఎం చంద్రబాబు.
HMPV వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. వైరస్ ను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రజలకు ఈ వైరస్ లక్షణాల గురించి అవగాహన కల్పించాలని అన్నారు. ఈ వైరస్ బారినపడకుండా ముందుగానే జాగ్రత్తపడేలా చూడాలన్నారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు జాగ్రత్తగా వుండాలని సీఎం చంద్రబాబు సూచించారు.
HMPV వైరస్ వ్యాప్తిని నివారించేందుకు, అవసరం వున్నపుడు సాయం కోసం వైద్య నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. మైక్రో బయాలజీ, ఫీడియాట్రిషన్స్, పల్మనాలజిస్ట్ లతో పాటు ఇతర వైద్య నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి దాని సలహాలు,సూచనలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి :
HMPV వైరస్ ఎవరికి ఎక్కువ ప్రమాదం
ఇండియాలో తొలి HMPV కేసు .. 8 నెలల శిశువుకు పాజిటివ్ : ఇక కరోనా సీన్ రిపీట్ కావాల్సిందేనా?
HMPV : ఈ వైరస్ తో తెలుగు ప్రజలు జాగ్రత్త ... ఇది మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా?