నిత్యం లక్షల మంది మెట్రో ప్రయాణం
మెట్రో సేవలు ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతిరోజు ప్రయాణీకులు ఈ రవాణా కూడా అద్భుతంగా ఉజయోగించుకుంటున్నారు. 2014లో 28 లక్షల నుంచి ఇప్పుడు కోట్లకు పెరిగింది. అంటే ఇది 2.5 రెట్లు పెరుగుదలని సూచిస్తుంది. అదేవిధంగా, మెట్రో రైళ్ళు ప్రయాణించే మొత్తం దూరం మూడు రెట్లు పెరిగి, 86,000 కిలోమీటర్ల నుంచి 2.75 లక్షల కిలోమీటర్లకు చేరింది.
ప్రధాని మోడీ ఈ ఘనతను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. "గత దశాబ్దంలో, మెట్రో కనెక్టివిటి ని పెంచేందుకు విశాలమైన పనులు సాగాయి.. దీని ద్వారా నగర రవాణాను బలోపేతం చేసి 'ఈజ్ ఆఫ్ లివింగ్' ను పెంచడం జరిగింది" అని ఆయన పోస్ట్ లో పేర్కొన్నారు.