ట్రంప్ తో భారత్ కు ఇబ్బందులేనా?
డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టనున్న క్రమంలో భారత ప్రభుత్వం ఉత్సాహంగా స్వాగతించడం చేసింది. అయితే, రాబోయే రోజుల్లో ట్రంప్ తో అదనపు ప్రయోజనాలకు బదులు మరింత ఇబ్బంది కలగవచ్చని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్కు ఫోన్ చేసిన మొదటి ముగ్గురు ప్రపంచ నాయకులలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. వీరి బలమైన సంబంధాలతో ఇరు దేశాలు అన్ని సమస్యలను పరిష్కరించుకుంటాయనీ, సానుకూల ధోరణిలో ముందుకు సాగుతాయని కూడా పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.