సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కంటే పనిమనిషి జీతమే ఎక్కువ.. ఏడాదికి 4.8 లక్షల సంపాదన సామీ !

Published : Mar 13, 2026, 10:01 PM IST

Indian Labor Market : ఐటీ ఫ్రెషర్ల కంటే గృహ కార్మికులు, చిన్న వ్యాపారులు భారత్‌లో ఎక్కువ సంపాదిస్తున్నారనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాల్యూ క్రియేషన్ ప్రాముఖ్యతపై నెటిజన్ల కామెంట్స్ ఆసక్తిని పెంచుతున్నాయి. ఆ సంగతేంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
క్లీనింగ్ చేస్తూ నెలకు 40 వేలు సంపాదిస్తున్న మహిళలు

భారతదేశంలో ప్రస్తుతం ఉపాధి, ఆదాయం అనే అంశాలపై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఒకప్పుడు కేవలం వైట్ కాలర్ ఉద్యోగాలు, ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే వారికే భారీ జీతాలు ఉంటాయని అందరూ భావించేవారు. కానీ, మారుతున్న కాలంలో సాంప్రదాయ సేవా రంగాలు, చిన్న వ్యాపారాలు కూడా కార్పొరేట్ ఉద్యోగుల కంటే ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్నాయని తాజా చర్చలు నిరూపిస్తున్నాయి. ఐటీ ఫ్రెషర్ల కంటే గృహ కార్మికులు (Domestic Maids) మంచి సంపాదన కలిగి ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

25
ఏడాదికి రూ. 4.8 లక్షల సంపాదన.. కొత్త ట్రెండ్ గురూ !

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో ఒక మహిళ షేర్ చేసిన పోస్ట్ కొత్త చర్చకు దారితీసింది. గృహ కార్మికులు ఇప్పుడు కేవలం పనిమనుషులుగా మాత్రమే కాకుండా, ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఇంటిపని సేవలను అందించే స్నాబిట్ (Snabbit) వంటి ప్లాట్‌ఫామ్‌లలో పనిచేసే క్లీనింగ్ వర్కర్లు నెలకు దాదాపు రూ. 40,000 వరకు సంపాదిస్తున్నారని ఆమె వెల్లడించారు. అంటే వీరి వార్షిక ఆదాయం రూ. 4.8 లక్షల వరకు ఉంటోంది. ఇది నేడు ఐటీ రంగంలో చేరుతున్న చాలా మంది ఫ్రెషర్ల జీతం కంటే ఎక్కువే కావడం గమనార్హం.

35
బగ్ సాల్వింగ్ వర్సెస్ బగ్ క్లీనింగ్

ఆ పోస్ట్‌లో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య వైరల్ అవుతోంది. "నిజమైన డబ్బు సాఫ్ట్‌వేర్ బగ్స్ సాల్వ్ చేయడంలో లేదు, ఇంటి లోపల బగ్స్ అయిన దుమ్ము, ధూళి క్లీన్ చేయడంలో ఉంది" అని ఆమె పేర్కొన్నారు. పట్టభద్రులైన ఇంజనీర్లు ఉద్యోగాల కోసం వేటాడుతుంటే, నైపుణ్యం ఉన్న సేవా రంగ కార్మికులు స్థిరమైన, గౌరవప్రదమైన ఆదాయాన్ని పొందుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. దీనికి ఉదాహరణగా టీ అమ్ముకుంటూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న 'డాలీ చాయ్‌వాలా'ను ఆమె ప్రస్తావించారు. కేవలం టీ అమ్మడమే కాకుండా, ఇప్పుడు ఆయన లక్షల రూపాయల విలువైన ఫ్రాంచైజీలను విక్రయించే స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు.

45
విలువ సృష్టించడమే ముఖ్యం

ప్రస్తుతం భారతదేశంలో జాబ్ టైటిల్ కంటే, మీరు మార్కెట్‌లో ఎంత విలువను సృష్టిస్తున్నారు అనేదే ముఖ్యం అని ఈ చర్చ పేర్కొంటోంది. కేవలం టెక్ ఉద్యోగాలనే గొప్పగా చూసే కాలం పోయిందని, క్లీనింగ్ సర్వీసులు, ఫుడ్ స్టాల్స్, టీ బిజినెస్ వంటి చిన్న వ్యాపారాలు కూడా అద్భుతమైన ఆదాయాన్ని అందిస్తున్నాయని ఆమె విశ్లేషించారు. సరైన నైపుణ్యం ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని, డిగ్రీలు మాత్రమే సంపాదనకు కొలమానం కాదని ఈ ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి.

55
నెటిజన్ల భిన్నాభిప్రాయాలు

ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డిమాండ్, సప్లై సూత్రం ఇక్కడ పనిచేస్తుందని ఒక యూజర్ పేర్కొన్నారు. "కోట్ల మంది ఇంజనీర్లు ఉన్నారు, కానీ నాణ్యమైన సేవలు అందించే గృహ కార్మికుల కొరత ఉంది" అని వ్యాఖ్యానించారు. ఒక యూజర్ తన ఇంట్లో పనిచేసే వంట మనిషి గురించి చెబుతూ, ఆమె నెలకు నాలుగు ఇళ్లలో పనిచేస్తూ భారీగా సంపాదిస్తోందని, బీహార్‌లో ఆమెకు సొంతంగా భూములు కూడా ఉన్నాయని రాసుకొచ్చారు. అయితే, కొందరు మాత్రం ఐటీ ఉద్యోగాల్లో భవిష్యత్తులో జీతం పెరిగే అవకాశం ఉంటుందని, కానీ క్లీనింగ్ వంటి పనుల్లో ఆదాయం ఒక స్థాయి వద్ద నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.

Read more Photos on
click me!

Recommended Stories