కరోనా రోగులకు ఫవిపిరవిర్ క్లినికల్ ట్రయల్స్: ఇండియాలో మూడో దశకు చేరిన టెస్టులు

First Published May 12, 2020, 3:17 PM IST

కరోనా నివారణలో భాగంగా పలు సంస్థలు ముందడుగు వేస్తున్నాయి. ఈ మేరకు ముంబైకి చెందిన గ్లెన్ మార్క్ కీలక ప్రకటన చేసింది. 

కరోనా వైరస్ ను నిరోధించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఫవిపిరవిర్ క్లినికల్ ట్రయల్స్ భారత్ లో కీలక దశకు చేరుకొన్నాయి.కరోనా వైరస్ ను అరికట్టేందుకు పలు సంస్థలు ప్రయోగాలు చేస్తున్నాయి.
undefined
ఇండియాలోని ముంబైకి చెందిన గ్లెన్ మార్క్ పార్మాసూటికల్స్ సంస్థ కరోనా రోగులపై పవిపిరవిర్ మందును ప్రయోగించనుంది.
undefined
కరోనా రోగులపై యాంటీ వైరల్ ఔషధం ఫవిపిరవిర్ క్లినికల్ ట్రయల్స్ ఇండియాలో కీలక దశకు చేరుకొన్నాయి. ఈ ఔషధం ప్రయోగాలు మూడో దశకు చేరుకొన్నాయని గ్లెన్ మార్క్ ప్రకటించింది.
undefined
దేశంలోని పలు సంస్థలు కూడ కరోనా వైరస్ నివారించే వ్యాక్సిన్ తయారీలో ప్రయోగాలు చేస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీతో పుణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ కూడ ప్రయోగాలు చేస్తున్నాయి.
undefined
హైద్రాబాద్ కు చెందిన ఫార్మాసూటికల్స్ కంపెనీలు కూడ ఈ వైరస్ కు టీకాను కనిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.
undefined
వ్యాక్సిన్ పై ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రధాని మోడీతో ఈ నెల 11న జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో హైద్రాబాద్ నుండే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని కూడ ప్రకటించారు.
undefined
ఈ ఏడాది జూలై లేదా ఆగష్టు మాసానికి వ్యాక్సిన్ పై ప్రయోగాలు పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ డ్రగ్ తయారీకి కావాల్సిన యాక్టివ్ ఫార్మా ఇన్ గ్రేడియంట్ సంబంధిత సూత్రీకరణలను సైతం రూపొందించినట్టుగా పేర్కొంది.ఈ ప్రయోగాలు విజయవంతమైతే కరోనా చికిత్సలో ముందడుగు పడినట్టేనని సంస్థ ఉపాధ్యక్షురాలు మోనికా టాండన్ చెప్పారు.
undefined
ఇండియాకు చెందిన భారతీయ ఔషధ సంస్థ స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ కూడ గత వారంలో ఫెవిపిరవిర్ యాంటీ వైరల్ టాబ్లెట్లను అభివృద్ధి చేసినట్టుగా ప్రకటించింది. ఈ వారంలో ట్రయల్స్ ను ప్రారంభించేందుకు ధరఖాస్తు చేసినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది.ఫవిపిరవిర్ చైనా, దక్షిణా కొరియా వంటి దేశాల్లో కరోనా వైరస్ బాధితులకు మంచి ఫలితాలను ఇచ్చిన విషయం తెలిసిందే.
undefined
click me!