పేదవాడి జీవితాన్ని మార్చిన వజ్రం :
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లా వజ్రాల గనులకు ఫేమస్. జిల్లా కేంద్రం పన్నా చుట్టుపక్కల చాలా వజ్రాల గనులున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఈ గనుల్లో డైమండ్ మైనింగ్ చేపడుతోంది. ఇందులో భాగంగా స్థానిక ప్రజలకు గనులు, సహకార సంఘాలకు ఈ గనులను లీజుకు ఇస్తుంది ఎన్ఎమ్డీసీ. అయితే పర్యావరణానికి హాని చేయకుండా సాధారణ పనిముట్లు, పరికరాలతో తవ్వకాలు చేపట్టేందుకు అనుమతి ఇస్తుంది.