అయితే, గత నెల 26న కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరించబోతున్నట్టు ప్రకటించింది. కేంద్ర హోం శాఖ వ్యవహారాలు, కేంద్ర విదేశాంగ వ్యవహారాలు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది.