ఇదిలా ఉంటే 18వ బ్రిక్స్ సదస్సు-2026 కోసం ఇప్పటికే రష్యా, చైనా దేశాల అద్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, జిన్ పింగ్ ఇండియాకు చేరుకున్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు మాటమేల సిరిల్ రామపోసా, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, వియత్నాం ప్రధాని లే మిన్ హంగ్ కూడా డిల్లీలో ఉన్నారు.
ఇక బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులుగా నైజీరియా వైస్ ప్రెసిడెంట్ సెనేటర్ కాశీం శెట్టిమా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా అల్ సిసి, యూఏఈ షేక్ ఖాలిద్ మిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ సహ్యాన్, ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీలు ఇండియాకు చేరుకున్నారు. బురుండి, ఇండోనేషియా, పిలిప్పిన్స్ అధ్యక్షులు కూడా ఇప్పటికే డిల్లీకి విచ్చేశారు. ఇవాళ (సెప్టెంబర్ 12, శనివారం) మధ్యాహ్నం బ్రిక్స్ దేశాల అధినేతలంతా సమావేశం కానున్నారు... కీలక అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.
2026 సంవత్సరానికి గాను భారత్ అధ్యక్షతన సెప్టెంబర్ 12-13 తేదీల్లో అంటే ఇవాళ, రేపు (శని, ఆదివారం) 18వ బ్రిక్స్ సదస్సు జరగనుంది. 'స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం' అనే థీమ్తో భారత్ ఈ సదస్సుకు నేతృత్వం వహిస్తోంది. అభివృద్ధి, సుస్థిరత, ఆవిష్కరణలే ఈ సదస్సులో కీలక అంశాలు.
ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను కాపాడటంలో బ్రిక్స్ ఒక ముఖ్యమైన ప్లాట్ ఫామ్ గా మారింది. అభివృద్ధి, ఫైనాన్స్, టెక్నాలజీ, వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలు దీని అజెండాలో ఉన్నాయి.
ప్రస్తుతం ఈ BRICS కూటమిలో 11 దేశాలు ఉన్నాయి. అవి - బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూఏఈ. వీటితో పాటు 10 భాగస్వామ్య దేశాలు కూడా ఉన్నాయి. అవి - నైజీరియా, బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్థాన్, మలేషియా, థాయ్లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్థాన్, వియత్నాం