పూర్తి వివరాల్లోకి వెళితే.. భైరవేశ్వర్ నగర్ కి చెందిన ప్రతిభ (2ా9) సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఆమె.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. భర్త మహాంతేశ్ కూడా టెక్కీనే. వీరికి 11 నెలల కుమారుడు అగస్త్య ఉన్నాడు. తన కుమారుడుని చూసుకుంటే.. ప్రతిభ ఇంటి పని, ఆఫీసు పనులు చేసుకునేది.
కాగా.. భర్త ఆఫీసుకు వెళ్లిన తర్వాత.. ప్రతిభ ఆరేసిన దుస్తులు తీసుకురావడానికి బయటకు వెళ్లింది. ఆ సమయంలో బాబు ఆడుకుంటూ వెళ్లి బకెట్ లోని నీటిలో పడి చనిపోయాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా, తీవ్ర ఆవేదనతో ప్రతిభ సూసైడ్ నోట్ రాసి.. బలవన్మరణానికి పాల్పడింది.