అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో AIADMK ఎన్నికల హామీలను ప్రకటించింది… దీంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. అన్నాడిఎంకే ప్రకటించిన ఐదు హామీలివే..
- పురుషులకు ఉచిత బస్సు :
ఇప్పటికే తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవుతోంది. అయితే తాము అధికారంలోకి వస్తే పురుషులకు కూడా సిటీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అన్నాడిఎంకే హామీ ఇచ్చింది. పట్టణాల్లో ఉండే ఉద్యోగులు, కార్మికులను ఆకట్టుకునేందుకు ఈ హామీని ప్రకటించారు.
2. మహిళలకు నెలనెలా రూ.2000 :
మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కొనసాగిస్తూనే ఆర్థికంగా అండగా ఉండేందుకు మరో పథకాన్ని కూడా అమలు చేస్తామని అన్నాడిఎంకే హామీ ఇచ్చింది. మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.2000 వేస్తామని ప్రకటించింది. ఈ పథకం ద్వారా ప్రతి రేషన్ కార్డుదారునికి నెలకు రూ.2,000 సహాయం అందిస్తారు…. ఈ మొత్తం కుటుంబ యజమానురాలి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
3. 100 రోజుల పని 150 రోజులకు పెంపు :
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రస్తుతం 100 రోజులు పని కల్పిస్తున్నారు. అయితే అన్నాడిఎంకే అధికారంలోకి వస్తే పనిదినాలు 150 రోజులకు పెంచుతామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఆకట్టుకునేందుకు ఈ హామీ ఇచ్చారు.