Gold: నోటిలో 82 గ్రాముల బంగారాన్ని దాచేశాడు... అయినా దొరికిపోయాడు

Published : Aug 30, 2026, 10:44 AM IST

Gold: బంగారం ధరలు పెరుగుతుండడంతో బంగారం అక్రమ రవాణా కూడా పెరిగిపోయింది. బెంగళూరుతో ఓ వ్యక్తి నోట్లో 82 గ్రాముల బంగారాన్ని దాచేశాడు. అయినా పోలీసులకు దొరికిపోయాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి.

PREV
13
నోటిలో బంగారం

బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. అందుకే అక్రమ రవాణా కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ అక్రమ రవాణా కోసం కొందరు వ్యక్తులు ఎవరూ ఊహించని మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చిన ఓ ప్రయాణికుడు ఏకంగా తన నోట్లో బంగారాన్ని దాచుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు తనిఖీ చేస్తే అసలు విషయం బయటపడింది. ఆగస్టు 26న ఈ ఘటన చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఆ ప్రయాణికుడు అక్కడి నుంచి ఘాజియాబాద్ వెళ్లాల్సి ఉంది.

బెంగళూరు విమానాశ్రయంలోని టెర్మినల్-1లో విమానం ఎక్కేందుకు ముందు భద్రతా తనిఖీలు జరుగుతున్న సమయంలో CISF సిబ్బంది అతడిని గమనించారు. తనిఖీల సమయంలో అతడు సరిగా స్పందించకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఏం అడిగినా సమాధానం చెప్పకోపోవడంతో అతడి నోరును తెరిపించారు. అతడి నోట్లో రెండు క్యాప్సూల్స్ ఉన్నట్లు గుర్తించారు. వాటిని బయటకు తీయగా అందులో పసుపు రంగులో ఉన్న లోహం కనిపించింది. రెండు క్యాప్సూల్స్ బరువు కలిపి సుమారు 82 గ్రాములు ఉన్నట్లు తేలిసింది. బంగారాన్ని ద్రవరూపంలోకి మార్చి క్యాప్సూల్స్ లో వేసి తీసుకొచ్చేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు.

23
ఎవరు అతను?

ఆ వ్యక్తి పేరు మొహమ్మద్ సిరాజ్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. అతడు దుబాయ్ నుంచి ఇండిగో విమానంలో బెంగళూరుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి మరో ఇండిగో విమానంలో ఘాజియాబాద్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఉదయం టెర్మినల్-1లో ప్రీ-ఎంబార్కేషన్ సెక్యూరిటీ చెక్ జరుగుతున్నప్పుడు CISF సిబ్బంది అతడిని ఆపారు. సాధారణంగా విమానాశ్రయంలో ప్రయాణికుల బ్యాగులు, వ్యక్తిగత వస్తువులతో పాటు వారి ప్రవర్తనను కూడా భద్రతా సిబ్బంది గమనిస్తుంటారు. ఈ ప్రయాణికుడి ప్రవర్తనలో తేడా కనిపించడంతో అధికారులు మరింత జాగ్రత్తగా తనిఖీ చేశారు. చివరకు పట్టుబడిపోయాడు.

33
చివరికి ఏం జరిగింది?

అధికారులు స్వాధీనం చేసుకున్న క్యాప్సూల్స్ ను పరీక్షలకు పంపించారు. అది బంగారంగా తేలింది. ఈ ఘటన తర్వాత ప్రయాణికుడిని బెంగళూరు విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. అతడిని విచారించి ఈ లోహాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఎవరికి ఇవ్వాల్సి ఉంది? దీని వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులపై కస్టమ్స్, విమానాశ్రయ భద్రతా సంస్థలు ప్రత్యేక నిఘా ఉంచుతుంటాయి. బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు గతంలో కూడా బ్యాగులు, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, షూస్ ఇలా ఎన్నో మార్గాలను ఉపయోగించిన ఘటనలు బయటపడ్డాయి. అయితే ఈసారి ఏకంగా నోట్లో రెండు క్యాప్సూల్స్ పెట్టుకుని తీసుకురావడం భద్రతా సిబ్బందిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

Read more Photos on
click me!

Recommended Stories