ప్రాచీన కాలంలో విద్యుత్ సరిగ్గా ఉండేది కాదు. కొవ్వొత్తులు, దీపాల వెలుగులోనే గడిపేవారు. దీంతో రాత్రుళ్లు గోళ్లను కత్తిరిస్తే గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే రాత్రి గోళ్లను కత్తిరించకూడదనే ఆచారం వచ్చిందని అంటారు. రాత్రివేళ గోళ్లు నేలపై పడితే అవి కనిపించక పోవచ్చు. అవి ఆహారపదార్థాలలో పడితే, ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గోళ్లలో ఉండే మలినాలు మనకు తెలియకుండానే ఆహారంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అదే విధంగా చీకట్లో గోళ్లు కింద పడితే చిన్న పిల్లలు వాటిని తీసుకొని తినే ప్రమాదం కూడా ఉంటుందనే ఉద్దేశంతో చీకట్లో గోళ్లను కత్తిరించకూడదని చెబుతుంటారు.
అయితే ప్రస్తుతం కాలం మారింది. విద్యుత్ దీపాలు అందుబాటులోకి వచ్చాయి. గోళ్లు కింద పడకుండా ఉండే సరికొత్త నెయిల్ కటర్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాత్రుళ్లు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా గోళ్లను కత్తిరించుకుంటున్నారు. అయితే నమ్మకాలను విశ్వసించాలా వద్దా అనేది వారి వారి ఆలోచనలపై ఆధార పడి ఉంటుంది.