ఎరుపు రంగు, శక్తికి చిహ్నం ఇక తెలుపు రంగు స్వచ్చతకు చిహ్నం. ఎరుపు, తెలుపు రంగుల రెండు కూడా దుర్గాదేవికి ఇష్టమైనవే. దుర్గాపూజ సమయంలో శక్తికి చిహ్నంగా ఎరుపు రంగును స్వచ్ఛతకు, చిహ్నంగా తెలుపు రంగును కలిపి ధరిస్తే అమ్మవారి అనుగ్రహం దొరుకుతుందని చెప్పుకుంటారు. అందుకే మహిళలు దుర్గా పూజ రోజు ఇలా ఎరుపు అంచు ఉన్న తెల్లచీరను ధరించేందుకే ఇష్టపడతారు. ఈ రెండు రంగులు కలయిక కూడా ఎంతో అందంగా ఉంటుంది.