ఇలాంటి ఆహారాలు తింటే..
పొట్ట నిండా తింటే నిద్రగా అనిపించడం, బద్ధకంగా అనిపించడం జరుగుతుంది. పొట్ట నిండా తిన్నాక పండ్లు, లస్సీ, జ్యూస్లు కూడా తాగితే నిద్ర ముంచుకొస్తుంది. ముఖ్యంగా ఎక్కువ కేలరీలు, వేపుళ్లు, స్వీట్లు తిన్నప్పుడు నిద్ర మత్తు ఎక్కువగా అనిపిస్తుంది. మధ్యాహ్న భోజనం తర్వాత శరీరంలో జీర్ణక్రియకు సంబంధించిన మార్పులు చాలా జరుగుతాయి. రక్తంలో గ్లూకోజ్, ఇతర పోషకాల స్థాయిలలో మార్పులు వస్తాయి.
రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోయినా కూడా మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర ముంచుకొస్తుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉంటే పగటిపూట నిద్ర వస్తుంది. అందుకే రాత్రిపూట తగినంత నిద్రపోవడం చాలా అవసరం.