Garuda Purana: గరుడ పురాణం ప్రకారం,ఈ 5 పనులు చేస్తే...అదృష్టం రెట్టింపు అవుతుంది..!

Published : Aug 10, 2026, 01:27 PM IST

Garuda Purana: గరుడ పురాణం ప్రకారం, ప్రతి రోజూ 5 పనులు చేస్తే.. అదృష్టం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు లేకుండా, జీవితంలో కష్టాలు లేకుండా సంతోషంగా జీవిస్తారు.

PREV
13
గరుడ పురాణం..

గరుడ పురాణం హిందూ మతంలోని 18 గొప్ప పురాణాలలో ఒకటి. ఇది విష్ణుమూర్తికీ, ఆయన వాహనమైన గరుడ పక్షికి మధ్య జరిగిన సంభాషణగా పరిగణిస్తారు. గరుడ పురాణం జీవితం, మరణం, కర్మ, పునర్జన్మ రహస్యాలను వివరిస్తుంది. జనన మరణ రహస్యాల గురించి మాత్రమే కాదు.. ప్రతిరోజూ కొన్ని పనులు చేయడం వల్ల జీవితంలో సంతోషం పెరగడంతో పాటు, అదృష్టం రెట్టింపు అవుతుంది. విజయ అవకాశాలు కూడా పెరుగుతాయి. మరి, గరుడ పురాణం ప్రకారం ప్రతిరోజూ కచ్చితంగా చేయాల్సిన 5 పనులు ఇవే..

23
ఉదయాన్నే స్నానం చేయాలి...

ప్రతిరోజూ అందరూ స్నానం చేస్తారు.కానీ, తమకు తోచిన సమయంలో చేస్తూ ఉంటారు. కానీ, గరుడ పురాణం ప్రకారం మన రోజుని స్నానంతోనే ప్రారంభించాలి. స్నానం చేయకుండా ఏ పనులు చేయకూడదు. స్వచ్ఛమైన శరీరంలోనే స్వచ్ఛమైన మనసు ఉంటుంది. ప్రతిరోజూ స్నానం చేయని వారు జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. అలా కాకుండా, ఉదయాన్నే స్నానంతోనే తమ పనులు మొదలుపెట్టేవారి జీవితం ఆనందంగా ఉంటుందని గరుడ పురాణంలో పేర్కొన్నారు.

ప్రతిరోజూ దైవారాధన...

గరుడ పురాణం ప్రకారం, క్రమం తప్పకుండా ధ్యానం చేయడం, దైవరాధన చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజూ దేవతను పూజించేవారు దురదృష్టం తొలగి, అన్ని పనుల్లోనూ విజయం పొందుతారు.

33
ప్రతిరోజూ దైవ నామాన్ని జపించండి.

గరుడ పురాణం ప్రతిరోజూ దైవ నామాన్ని జపించాలి. క్రమం తప్పకుండా జపించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి, ధ్యానం చేసి, భగవంతుని జపించాలి. ఇలా చేయడం వల్ల మనసుకు శాంతి లభించి, అదృష్టం ఆకర్షిస్తుంది. శుభం కలుగుతుంది.

4. విరాళం ఇవ్వడం అత్యవసరం

గరుడ పురాణం ప్రకారం, ప్రతిరోజూ క్రమం తప్పకుండా దానధర్మాలు చేయాలి. అలా చేయడం వల్ల ఒక వ్యక్తి శ్రేయస్సు మెరుగుపడుతుంది. అదృష్టం కలుగుతుంది. సంపద అనేక మార్గాల ద్వారా వస్తుంది. తమ శక్తి మేరకు క్రమం తప్పకుండా దానధర్మాలు చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. అలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

5. పూజ చేయండి లేదా దీపం వెలిగించండి

గరుడ పురాణం ప్రకారం, ప్రతిరోజూ ఆలయంలో దీపం వెలిగించడం లేదా పూజ చేయడం జీవితంలోని అన్ని బాధలను తొలగిస్తుంది. ప్రతిరోజూ పూజ చేయడం లేదా దీపం వెలిగించడం వల్ల దేవతలందరి ఆశీస్సులు లభిస్తాయి.

పూజ చేయడం, దీపాలు వెలిగించడం ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేసి, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ప్రతిరోజూ ఈ పనులు చేసేవారి ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుందని, అదృష్టం పెరుగుతుందని గరుడ పురాణంలో పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories