తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..?

First Published Jan 24, 2023, 3:00 PM IST

తిన్న వెంటనే పడుకోవడమో, కూర్చోవడమో చేయకుండా కొన్ని అడుగులు నడవాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. భోజనం చేసిన తర్వాత కొద్ది సేపు నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. 
 

walking

మన దేశంలో డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. డయాబెటిస్ ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. దీనికి సకాలంలో చికిత్స చేయించుకోలేకపోతే  హృదయ సంబంధ సమస్యలు, వేళ్లు, కాలిలోని నరాల నష్టం, మూత్రపిండాల రుగ్మతలు, కంటి సమస్యలు, పేలవమైన రక్త ప్రవాహం, పాదాలలో నరాలోని దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు ఈ డయాబెటీస్ గాయాల నుంచి తీవ్రమైన సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. 

walking

ఇకపోతే నడక మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే ఇది ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతుంది. మరెన్నో సమస్యలు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. అందుకే రోజూ తప్పకుండా నడవాలని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం వల్ల  జీర్ణక్రియ బాగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తిన్న తర్వాత 15 నిమిషాలు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇది టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలను నివారించడానికి కూడా సహాయపడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి నడక ఎలా సహాయపడుతుందో తెలుసుకునేందుకు ఏడు అధ్యయనాల ఫలితాలను పరిశోధకులు ఇటీవల పరిశీలించారు.స్పోర్ట్స్ మెడిసిన్ జర్నల్ లో ఇటీవల ప్రచురితమైన మెటా అనాలిసిస్ లో ఈ పరిశోధనలు ప్రచురితమయ్యాయి. భోజనం తర్వాత రెండు నుంచి ఐదు నిమిషాలు తేలికపాటి నడక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనం కనుగొంది.
 

walking

తిన్నతర్వాత  కొన్ని నిమిషాల పాటు నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు పరిశోధకులు కనుగొన్నారు. అలాగే క్రమం తప్పకుండా ఏరోబిక్ కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని పరిశోధకులు కనుగొన్నారు. దీనివల్ల ఇన్సులిన్ కు సున్నితత్వం పెరుగుతుంది.

నడక వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడమే కాదు..  అలసట, కేలరీలు తగ్గుతాయి. అలాగే శరీరం శక్తి వంతంగా మారుతుంది. గుండె ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలు బలంగా అవుతాయి. శరీరం

click me!