మలబద్దకం నుంచి బయటపడాలంటే ఇలా చేయండి..

Published : Nov 04, 2022, 02:58 PM IST

తినడం, నిద్రపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి వంటివన్నీ మనల్ని చిక్కుల్లో పడేస్తాయి. ముఖ్యంగా మలబద్దకం సమస్య వచ్చేలా చేస్తాయి. ఈ మలబద్దకం చిన్న సమస్యగా  అనిపించినా.. మనిషిని కుదురుగా ఉండనీయదు. 

PREV
16
 మలబద్దకం నుంచి బయటపడాలంటే ఇలా చేయండి..

కడుపునకు సంబంధించిన సమస్యలు మొత్తంగా ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అజీర్థి, గ్యాస్ట్రిక్, మలబద్ధకం, గుండెల్లో మంట, పుల్లటి త్రేన్పులు కడుపునకు సంబంధించిన సమస్యలు. తినడం, నిద్రపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి వంటి అలవాట్ల వల్ల ఈ సమస్యలు వస్తాయి. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటే ఇలాంటి సమస్యల నుంచి సులువుగా బయటపడొచ్చు. 
 

26

పేగు కదలికలు సరిగ్గా లేకపోతే మలబద్దకం సమస్య వస్తాయి. దీనివల్ల కడుపు ఉబ్బిపోతుంది. కడుపులో గ్యాస్ పేరుకుతుంది. దీనివల్ల ఆకలి ఉండదు. కడుపంతా అదో రకంగా ఇబ్బందికరంగా  ఉంటుంది. మన  రోజు వారి అలవాట్లే ఈ సమస్య బారిన పడేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం.. మలబద్ధకం నుంచి బయటపడటానికి ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవేంటంటే..

36

అల్లం  

అల్లం ఎన్నో ఔషధ గుణాలున్న పదార్ధం. ఇది  జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. దీంతో మలబద్దకం నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాదు అల్లం గట్ పై ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఈ భాగాలన్నీ సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. అయితే కడుపు లోపల శ్లేష్మం పేరుకుపోతే కూడా మలబద్ధకానికి కారణమవుతుంది. అల్లం దీని నుంచి ఉపశమనం కలిగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
 

46

వేడి నీరు

మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి వేడి నీరు అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. ఉదయం గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగితే.. మలబద్దకం తగ్గిపోతుంది. ఆయుర్వేదం ప్రకారం.. గోరు వెచ్చని నీటిని రోజూ తాగితే  జీర్ణక్రియను వేగంగా పనిచేస్తుంది. అంతేకాదు మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది కూడా.
 

56

అత్తి పండ్లు

అత్తి పండ్లను తింటే కూడా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందొచ్చు. ఈ పండు కేవలం మలబద్దకం నుంచి ఉపశమనం పొందడానికి మాత్రమే కాదు జీర్ణ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. డ్రై అత్తి పండ్లను రాత్రంతా నానబెట్టి పొద్దున తింటే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

66
black raisins

బ్లాక్ ఎండుద్రాక్ష

నల్ల ఎండుద్రాక్షలను తింటే ఎన్నోఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.  వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం మంచిది. క్రమం తప్పకుండా ఐదు లేదా ఆరు ద్రాక్షపండ్లను  ఇలా తింటే మలబద్దకం ఒక్కటే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories