పసుపు, పెరుగు ఫేస్ ప్యాక్
పసుపు చర్మం పొడి బారడాన్ని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే మొటిమలను, మొటిమల వల్ల అయ్యే మచ్చలను తగ్గించడానికి, వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయడానికి సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇందుకోసం పెరుగు, పసుపును బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోండి. మీరు ఈ ప్యాక్ ను వారానికి రెండుసార్లు అప్లై చేయొచ్చు. పెరుగు చర్మాన్ని మరింత కాంతివంతంగా తయారుచేస్తుంది. అలాగే నల్లటి మచ్చలను, పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది. చర్మం రంగును మెరుగుపరుస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ట్యాన్, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ను కూడా తొలగిస్తుంది.