చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పెకింగ్ యూనియన్ మెడికల్ కాలేజ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల గుండె సంబంధిత రోగాలు, అధిక రక్తపోటు, డయాబెటీస్ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. దీనికి తోడు పని గంటలకు మించి కూర్చొంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోయి.. మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుందని పరిశోధకలు కనుగొన్నారు.