Sankranti 2024: ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ పండుగలను జరుపుకుంటారు. ఈ మూడు రోజుల్లో ఏ రోజుకారోజు ఎంతో ప్రత్యేకమైనవి. ఇక మొదటి రోజు రేపే కాబట్టి.. భోగి నాడు ఉదయాన్నే భోగి మంటలను వెలిగిస్తారు. ఇక సాయంత్రం వేళ పిల్లలపై భోగి పళ్లతో దిష్టి తీస్తారు. ఈ రోజు రేగు పళ్లనే మనం భోగి పళ్లుగా పిలుస్తాం. అయితే భోగి పండుగ నాడు పిల్లలకు భోగి పళ్లతో దిష్టి తీయడం వెనుక పెద్ద కథే ఉంది.