ఈ ఏడాది జనవరి 15 వ తేదీన అంటే ఈ రోజు మకర సంక్రాంతి జరుపుకుంటున్నాం. ఈ రోజునే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడని నమ్ముతారు. అయితే ఈ మకర సంక్రాంతిని కిచిడీ పండుగ అని కూడా అంటారు. యుపీ, బీహార్ ప్రజలు ఈ రోజున గంగానదిలో స్నానం చేసి సూర్య భగవానుడిని పూజిస్తారు. లేదా ఇంట్లో ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడిని మొక్కుతారు. ఆ తర్వాత చురా, పెరుగు, బెల్లం, నువ్వులు, కిచిడీ వంటి దార్థాలను దానంగా ఇస్తారు. ఆ తర్వాత ప్రజలు మొదట చురా పెరుగు, నువ్వులతో చేసిన ఆహారాలను తింటారు.