ప్రొఫెషనల్ డ్యానర్..
రాధికా మర్చంట్ చిన్ననాటి నుంచే భరతనాట్యంలో శిక్షణ పొంది, గతంలో తన 'అరంగేట్రం'తోనే అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ నాట్య పటిమను ఈ గణేష్ చతుర్థి వేడుకలో ప్రదర్శించి, విఘ్నేశ్వరుని మహిమను తన అభినయం ద్వారా ఎంతో మనోహరంగా ప్రదర్శించారు.
ప్రతి ఏటా అంబానీ కుటుంబం తమ నివాసంలో గణేష్ చతుర్థి వేడుకలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. దేశంలోని ప్రముఖ సినీ తారలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ఏడాది రాధికా మర్చంట్ సమర్పించిన ఈ ప్రత్యేక భరతనాట్య నివాళి ఆంటిలియా వేడుకలకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు: రాధికా మర్చంట్ సమర్పించిన ఈ నృత్య నివాళికి నెటిజన్ల నుంచి, అంబానీ అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. "సంస్కృతి, సాంప్రదాయాల పట్ల ఆమెకున్న గౌరవం అభినందనీయం", "రాధికా అభినయం ఎంతో ప్రశాంతతను, భక్తి భావాన్ని కలిగిస్తోంది" అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో ప్రశంసలు కురిపిస్తున్నారు.