చర్మంపై ఉండే జిడ్డు, మురికి తొలగిపోయి అందంగా, కాంతి వంతంగా మారాలంటే ఇలా చేయండి. పెసర పిండిని మూడు టీ స్పూన్లు తీసుకుని అందులో ఒక టీ స్పూన్ బియ్యంపిండి, పసుపు కొద్దిగా వేసుకుని అందులో కొంచెం రోజు వాటర్ పోయాలి. ఈ మిశ్రమాన్ని పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోవాలి. దాన్ని ముఖానికి రాసుకుని కొద్ది సేపు మసాజ్ చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే బ్యాక్టీరియా, రంద్రాల్లో ఉండే మురికి అంతా తొలగిపోతుంది. అంతేకాదు దీనివల్ల ముఖం కాంతి వంతంగా తయారవుతుంది.