అన్నట్లుగానే రామాయణ సమయంలో రాముడు వనవాసం వెళ్లిన సమయంలో భరతుడు రాజుగా బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. అయితే అన్నపై ఉన్న గౌరవంతో భరతుడు రాముడి పాద రక్షాలను సింహాసనంపై పెట్టి రాజ్యాన్ని పాలిస్తాడు. ప్రతీ రోజూ ఆ పాద రక్షాలను నమస్కరిస్తుంటాడు. అయితే భరతుడు అలా నమస్కరించిన ప్రతీసారి అతని తలపై ఉన్న కిరీటం సిగ్గుతో తల వంచుకునేది. చెప్పులకు ఇంతటి మహర్ధశ వచ్చిందని కిరీటం బాధపడింది.
నీతి: ఎదుటి వ్యక్తి పరిస్థితిని, సంపదను, హోదాను చూసి అపహాస్యం చేయకూడదనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది. కాలం ఎప్పుడు ఎవరినీ ఎక్కడ ఉంచుతుందో ఎవరికీ తెలియదు. సరైన సమయం వచ్చినప్పుడు ప్రతీ ఒక్కరి గొప్పదనం తెలుస్తుందనే సందేశాన్ని అందిస్తుందీ కథ.