టీ చాలామందికి రిఫ్రెష్ డ్రింక్. టీ తాగకుండా చాలామందికి రోజు స్టార్ట్ కాదు. రోజుకు 2, 3 సార్లు టీ తాగే వాళ్లు కూడా ఉంటారు. మరి మన దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా టీ తాగుతారో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచంలో భారత్ ఎక్కువ టీ పొడి ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ నుంచి చాలా దేశాలకు టీ పొడి ఎగుమతి అవుతుంది. భారత్లో టీ ఒక రిఫ్రెష్ డ్రింక్. చాలామంది రోజుకు కనీసం రెండుసార్లు టీ తాగుతారు. మన దేశంలో టీకి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఏ రాష్ట్రంలో ఎక్కువమంది టీ తాగుతారో తెలుసా? మరి తెలుసుకుందాం పదండి.
27
టీ ఎక్కువగా తాగే రాష్ట్రం
భారత టీ బోర్డు దేశంలో ఏ రాష్ట్రం ఎక్కువ టీ తాగుతుందో తెలుసుకోవడానికి ఒక సర్వే చేసింది. ఈ రిపోర్ట్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఎక్కువ టీ తాగేది గుజరాత్ రాష్ట్రం. దేశం మొత్తం తాగే టీ కంటే గుజరాత్లోనే ఎక్కువ తాగుతారట.
37
గుజరాత్ లో టీ ఎలా తాగుతారో తెలుసా?
గుజరాత్లో జనాలు టీ తాగుతూనే ఉంటారు. పొద్దున లేస్తే టీ, బయటకు వెళ్లొస్తే టీ, ఎవరొచ్చినా టీ, సంతోషం, బాధ ఏదైనా టీనే కావాలంట. అందుకే గుజరాత్ జనం నీళ్లలా టీని వాడేస్తారని అంటారు. గుజరాత్ రాష్ట్రం ఎక్కువ టీ తాగుతుందని టీ బోర్డు సర్వేలో తేలింది.
47
టీ ఎందుకు?
గుజరాత్ ఎందుకు అంత టీ తాగుతుందోనని అందరికీ డౌట్ ఉంది. దీనికి కొంతమంది నిపుణులు చెప్పే సమాధానం ఏంటంటే అక్కడ పాలు ఎక్కువ దొరుకుతాయని. అందుకే జనాలు టీ చేసుకొని తాగే ఛాన్స్ ఉందట. గుజరాత్ వాళ్ల లైఫ్ లో టీ ఒక భాగం అయిపోయింది అంటున్నారు నిపుణులు.
57
రెండో స్థానంలో హర్యాన
రెండో స్థానంలో హర్యానా ఉంది. హర్యానా జనాలు కూడా ఎక్కువే టీ తాగుతారు. ఈ లిస్టులో మూడో స్థానం గోవాది. గోవాలో మందు మాత్రమే కాదు, టీ కూడా ఎక్కువే తాగుతారు.
67
4వ ప్లేస్ లో పంజాబ్
నాలుగో స్థానం పంజాబ్కు దక్కింది. పంజాబ్లో లస్సీ చాలా ఫేమస్. కానీ జనాలు టీని కూడా అంతే ఇష్టపడతారు. పంజాబీలు రోజు టీ తాగుతారు. పంజాబీ టీ కూడా దేశంలో ఫేమస్ అని భారతీయ టీ బోర్డు చెప్పింది.
77
5వ స్థానంలో జమ్మూ
5వ స్థానంలో జమ్మూ కాశ్మీర్ ఉంది. అక్కడ మంచు, చలి ఎక్కువగా ఉండటం వల్ల టీ తాగడం కూడా ఎక్కువే ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో కాఫీ తాగేవాళ్లు కూడా ఎక్కువే. శరీరం వెచ్చగా ఉండటానికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఎక్కువ.