గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, నా మిత్రులకు.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ప్రతి ఏడాది మనం జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో గర్వంగా నిర్వహించుకుంటాం. మన దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఇది. ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే పాలించే విధానం ఈరోజే ప్రారంభమైంది. భారతదేశం ఒక స్వతంత్ర, గణతంత్ర దేశంగా మారింది. మన రాజ్యాంగం ప్రతి పౌరునికి ఎన్నో హక్కులు ఇచ్చింది. కుల,మత, భాషా, ప్రాంతం అనే తేడా లేకుండా అందరికీ సమాన గౌరవం కల్పించింది. ఇదే మన దేశానికి గొప్ప బలం. మన స్వాతంత్య్రం కోసం ఎంతో మంది వీరులు త్యాగాలు చేశారు. ఆ త్యాగాలను గుర్తుచేసుకొని దేశ అభివృద్ధికి మన వంతు బాధ్యతను నిర్వర్తించాలి. చదువులో, నిజాయితీలో మనమే ముందుండాలి. అదే వారికి మనమిచ్చే గౌరవం.
జై హింద్