చర్మం త్వరగా ఎర్రబడే వారు, మంటలు వచ్చే వారికి అలోవెరా, రోజ్ వాటర్ మిశ్రమం చాలా సురక్షితమైన పరిష్కారం. ఇది చర్మానికి చల్లదనం ఇస్తుంది. లోపల నుంచే శుభ్రత కలిగిస్తుంది. డెడ్ స్కిన్, ట్యానింగ్ తగ్గాలంటే పెరుగు, ఓట్స్, తేనెతో స్క్రబ్ చేయవచ్చు. శనగపిండి, పాలు, పసుపుతో పల్చని మిశ్రమం మచ్చలను మెల్లగా తగ్గిస్తుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచరంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.