త్రికోణాసనం : గర్భిణీ స్త్రీలు తమ మొదటి త్రైమాసికం నుంచి అంటే 3 నెలల తరువాత ఈ యోగాసనాన్ని ప్రారంభించవచ్చు. దీనిలో త్రికోణాసనం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వెన్ను, నడుము, మెడను బలోపేతం చేయడంతో పాటు జీర్ణశక్తిని బలోపేతం చేస్తుంది.
గర్భిణీ స్త్రీలు వైద్యుడి అనుమతి లేకుండా ఎటువంటి యోగాసనాలు వేయకూడదు. ఒకవేళ మీ గర్భధారణకు ఎలాంటి సమస్య లేనట్లయితే డాక్టర్ అనుమతి తరువాత మీరు ఈ యోగాసనాన్ని వేయవచ్చు.