Motivational: పక్కవారి మాటలకు బాధపడుతున్నారా? ఈ కథ చదివితే మనసు ప్రశాంతంగా మారుతుంది.

Published : Mar 07, 2025, 03:26 PM ISTUpdated : Mar 07, 2025, 08:04 PM IST

తన కోపమే తనకు శత్రువు అని చిన్నప్పుడు పద్యాలు చదువకున్నాం. కానీ ఎంతటి ప్రశాంతమైన వ్యక్తికైనా సరే కోపం రావడం సర్వసాధారణం. అయితే కోపాన్ని ఎలా జయించాలో గౌతమ బుద్ధుడు చెప్పిన మాటలు వింటే ఇట్టే అర్థమవుతుంది. ఇంతకీ ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
13
Motivational:  పక్కవారి మాటలకు బాధపడుతున్నారా? ఈ కథ చదివితే మనసు ప్రశాంతంగా మారుతుంది.

ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామానికి వెళ్తాడు. ఆ గ్రామంలో ఉండే ఓ వ్యక్తి ఎలాంటి కారణం లేకుండానే బుద్ధుడిని దూషిస్తాడు. అవమానిస్తాడు, నొటికొచ్చినట్లు తిడతాడు. అయితే బుద్ధుడు మాత్రం ప్రశాంతంగా నవ్వుతాడు తప్ప. ఆ వ్యక్తిపై అస్సలు కోపం తెచ్చుకోడు. 

దీంతో ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి.. 'నేను నిన్ను ఇంతలా తిడుతున్నా? నీకు ఎందుకు కోపం రావడం లేదు. పైగా నవ్వుతున్నావు. నీకు ఏమైనా పిచ్చా.?' అని ప్రశ్నించాడు. 

23

దానికి బుద్ధుడు ప్రశాంతంగా బదులిస్తూ.. 'ఒక మనిషి ఎవరికైనా ఒక బహుమతి ఇచ్చే ప్రయత్నం చేస్తే, కానీ ఆ వ్యక్తి దాన్ని తీసుకోకపోతే, ఆ బహుమతి ఎవరికి ఉంటుందో చెప్పండి?' అని అంటాడు. దానికి ఆ కోపిష్టి బదులిస్తూ.. "దాన్ని ఇచ్చినవాడికే ఉంటుంది." అని సమాధానం ఇస్తాడు. 

అప్పుడు బుద్ధుడు హాస్యంగా చెప్పాడు.. "నువ్వు నన్ను తిడితే, నేను దాన్ని స్వీకరించకపోతే, ఆ కోపం నీ దగ్గరే ఉండిపోతుంది' అని బదులిస్తాడు. దీంతో ఆ కోపిష్టి ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. నిజమే కదా అని ఆలోచనలో పడిపోతాడు. 
 

33

నీతి: మన జీవితంలో రకరకాల మనుషులు ఎదురవుతుంటారు. మన ప్రశాంతతను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వాటిని మనసుకు తీసుకోకుండా హాయిగా ఓ నవ్వు నవ్వేస్తే శత్రువులు కూడా మన జోలికి రావడానికి వెనుకడుగు వేస్తారు. 

click me!

Recommended Stories