డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే వీటిని రోజూ తినాలని చెప్తుంటారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన ఎండుద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తాజా, ఆకుపచ్చ ద్రాక్షకంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కిస్ మిస్ ను అలాగే తినకుండా నానబెట్టి తినడం మంచిది. నానబెట్టిన ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ తో పాటుగా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. నానబెట్టిన ఎండుద్రాక్షలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..