కొంతమందికి పీరియడ్స్ సమయంలో రక్తస్రావం హెవీగా అవుతుంటుంది. మరికొందరికి పొత్తికడుపు నొప్పి ఉంటుంది. ఇంకొందరికి తలనొప్పి వస్తుంది. వికారంగా, వాంతులు అయ్యే వారు కూడా ఉన్నారు. పీరియడ్స్ సమయంలో డయేరియా, మైకము, వెన్నునొప్పి మొదలైన వాటితో సహా అనేక సమస్యలు వస్తాయి. రుతుస్రావం సమయంలో మహిళలు శారీరక నొప్పితో పాటు మానసిక సమస్యలతో కూడా బాధపడుతుంటారు. కోపం, ఏడుపు, డిప్రెషన్ వంటి సమస్యలు కొంతమంది ఆడవారిలో కనిపిస్తుంటాయి. రుతుస్రావం సమయంలో ఆడవారికి విశ్రాంతి చాలా అవసరం. ఇలాంటి సమయంలో కూడా పనిచేస్తే సమస్యలు పెద్దవవుతాయి. అయితే పీరియడ్స్ సమయంలో కొన్ని పనులను అస్సలు చేయకూడదంటారు నిపుణులు. అవేంటంటే..