మనకు ఏవైనా గొంతు సమస్యలు ఉంటే.. ఉప్పు నీటితో పుక్కిలిస్తూ ఉంటాం. డాక్టర్లు కూడా అదే చెబుతూ ఉంటారు. అలా ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల.. గొంతు సంబంధిత సమస్యలు , దగ్గు లాంటివి తగ్గుతాయి. అయితే… అదే ఉప్పు నీటిలో మనం పాదాలను ఉంచితే ఏమౌతుందో తెలుసా? దీని వల్ల మనకు కలిగే లాభాలేంటో చూద్దాం…
అది కూడా నార్మల్ వాటర్ లో కాదు.. గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేయాలి. దాదాపు 15 నిమిషాల పాటు ప్రతిరోజూ ఈ ఉప్పు నీటిలో ఉంచాలి. అలా ఉంచడం వల్ల ఉప్పులోని మెగ్నీషియం సల్ఫేట్ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి కూడా మనకు మేలు చేస్తాయి.