Sankranti 2022: అమ్మమ్మల కాలం నాటి అరిసెల తయారీ.. తింటే ఎంత రుచో.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

First Published Jan 14, 2022, 2:15 PM IST

Sankranti 2022: రెండు తెలుగు రాష్ట్రాలు ఘనంగా జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. మరి ఈ సంక్రాంతికి స్పెషల్ వంటకాలు లేకపోతే ఎట్లా.. అందులో అమ్మమ్మల కాలం నాటి అరిసెల రుచి చూడకపోతే అస్సలు బాగోదు. ఈ అరిసెలు రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అందించడంలో ముందుంటాయి. అమ్మమ్మల కాలం నాటి నుంచి తయారుచేస్తున్న ఈ అరిసెలు ఎంతో రుచిగా ఉంటాయో.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మరి వాటిని ఎలా తయారో చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Sankranti Special Food Ariselu: సంక్రాంతి పండుగ తెలుగు ప్రజలకు అతిపెద్ద పండుగ. ఈ పండుగ ఎన్నో సంతోషాలను పట్టుకొస్తుంది. ముఖ్యంగా అన్నదాత కళ్లలో ఎన్నో ఆనందాలను తీసుకొస్తుంది. శీతాకాలంలో వచ్చే ఈ పండగ చాలా ప్రత్యేకమైనది. ఇక ఈ పండుగ అంటేనే రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, కోడి పందాలు, కొత్త అల్లుండ్లు. ఇక వీటితో పాటుగా గుమగుమలాడే పిండి వంటలు, స్వీట్లు కూడా సంక్రాంతి స్పెషల్సేనండి. ఇందులో పిండి వంటలే ఎక్కువగా కనిపిస్తాయి. మురుకులు, గారెలు, అప్పాలు వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. ఇక స్వీట్లు కూడా బాగానే తయారుచేస్తారు. వీటిలో సంక్రాంతి స్పెషల్ వంటకం ఏంటంటే అరిసెలనే చెబుతారు చాలా మంది. ఈ అరిసెలు తెలుగువారి స్పెషల్ వంటకమని చెప్పొచ్చు. అమ్మమ్మల కాలం నాటి నుంచి తయారుచేస్తున్న ఈ అరిసెలు ఎంతో రుచిగా ఉంటాయో.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మరి వాటిని ఎలా తయారో చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

కావాల్సిన పదార్థాలు: బెల్లం పావుకిలో,  బియ్యం(రేషన్ బియ్యం) పావుకిలో, పావుకిలో చక్కెర, రెండు చిన్న స్పూన్ల నువ్వులు, నూనె, నెయ్యి తీసుకోవాలి.

తయారు చేసే పద్దతి: బియ్యాన్నినీట్ గా కడిగి ఒక రాత్రంతా నానబెట్టాలి. తర్వాత రోజు ఆ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇక దాన్ని రోట్లో వేసుకుని పిండిలా మెత్తగా రుబ్బుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసి.. స్టవ్ వెళిగించి దట్టంగా ఉండే ఒక గిన్నె పెట్టుకుని అందులో పంచదార, బెల్లం వెయ్యాలి. ఈ రెండు మునిగేలా అందులో Water పోసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగాక అందులో నెయ్యి వెయ్యాలి. ఆ మిశ్రమాన్ని నిదానంగా చెంచాతో తిప్పుకోవాలి. అయితే ఈ పాకం అరిసెలు చేసుకోవడానికి అనువుగా తయారయ్యిందని నిర్దారించుకోవాలంటే.. మరుగుతున్న పాకంలోంచి కొంచెం తీసుకుని కొంచెం పిండిలో పొయ్యాలి. ఆ పిండిని ఉండలుగా కట్టండి. ఆ ఉండలు Smooth గా వస్తే పాకం సిద్దమైందని అర్థం. అదే ఉండలు రఫ్ గా వస్తే మాత్రం ఇంకా పాకం సిద్దం కాలేదని అర్థం. అయితే ఈ పాకం గట్టిగా మారే వరకు ఉంచకూడదు. 
 

పాకం పూర్తిగా సిద్ధం అయ్యిందనిపిస్తే దాంట్లో కొన్ని నువ్వులు వేయాలి. ఆ తర్వాత మంటను సిమ్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత రుబ్బి పెట్టుకున్న బియ్యపు పిండిని వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు అరిసెలు చేయడానికి చలిమిడి రెడీ అయినట్టేలెక్క. ఆ మిశ్రమాన్ని దించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై బాణలి పెట్టి అందులో నూనె పొయ్యాలి. చలిమిడి పిండిని ఉండలు గా తయారుచేసి పెట్టుకోవాలి. ఒక పాలితిన్ కవర్ తీసుకుని దానిపై పిండి ముద్దను పెట్టి దానిపై మరొక కవర్ ను పెట్టి అరిసెలుగా తయారుచేయాలి. వాటిని కాగుతున్న నూనెలో వేసి గోల్డ్ కలర్ రాగానే వాటిని నూనెలోంచి బయటకు తీసుకోవాలి. మంట మరీ  High flame లో లేకుండా మిడిల్ గా ఉండేట్టు చూసుకోవాలి. పిండి ముద్దలన్నింటినీ ఇలాగే చేస్తే అదిరిపోయే అరిసెలు రెడీ అయినట్టే..

ప్రయోజనాలు:  అరిసెలు బియ్యం, బెల్లం, చక్కెర, నువ్వులు, నెయ్యితో తయారు చేస్తాం. ఇందులో బెల్లం శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంతో పాటుగా Blood ను శుద్ధి చేస్తుంది. వీటి వల్ల మనకు ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. బియ్యం మన శరీరాన్ని వేడిగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. వీటి ద్వారా కార్బోహైడ్రేట్లు కూడా మనకు మెండుగా లభిస్తాయి. అన్ని రకాలుగా అరిసెలు మన ఆరోగ్యానికి శ్రేయస్కరం. అందుకే అరిసెలు తినాలని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.  
 

click me!